ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

కోవిడ్ సోకిన ఉద్యోగులకు 30 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని అడిగామని, ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో వెల్లడించింది.
కోవిడ్ కారణంగా రెండు నెలల పాటు తగ్గించిన డిఫర్ జీతాలు ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించినట్లు ఏపీ ఎన్జీవో సంఘం వెల్లడించింది. దీంతో పాటు సీపీఎస్ అమలు, పీఆర్సీ విషయంలో కూడా సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొంది. తమ సమస్యల గురించి సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగికి రిటైర్ అయ్యేలోపు ఇంటి స్థలాలను ఇవ్వాలని సీఎం జగన్కు విజ్ఞప్తి చేశామని అన్నారు.
కోవిడ్ సోకిన ఉద్యోగులకు 30 రోజుల ప్రత్యేక సెలవు ఇవ్వాలని అడిగామని, ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. కోవిడ్ కారనంగా రెండు నెలల డిఫర్ జీతాలు, పెన్షన్లు, రెండు డీఏలు నవంబరు నెలలో ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించినట్లు వెల్లడించారు. అన్ని రకాల సౌకర్యాలు, రాయితీలు ఇవ్వటానికి సీఎం అంగీకరించారని సంతోషం వ్యక్తం చేశారు. ఇక నాలుగవ తరగతి ఉద్యోగుల వయోపరిమితి 62 ఏళ్ళకు పెంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఉద్యోగుల అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నామని తెలిపారు.